గోపీచంద్ శతజయంతి ప్రారంభ సభకి ఆహ్వానం

ఇటీవలి దుర్ఘటన మూలంగా,  గోపీచంద్ శతజయంతి ప్రారంభ సభ వాయిదా వేయబడినది.
గమనించగలరు.

సాహితీ అభిమానులైన మీకు ఇదే మా అహ్వానం.

త్రిపురనేని గోపీచంద్ శతజయంతి
ప్రారంభ సభ
హైదదాబాదులోని రవీంద్ర భారతి లో
మంగళవారం, 8 సెప్టెంబరు 2009 న
సాయంత్రం 6.30 కి.
గోపీచంద్ రచనా సర్వసం (పది సంపుటాలు)
ఆవిష్కరణ కూడా!
మీరు తప్పక రావాలి!

“చెక్ ఎక్కడ ఇవ్వాలి?”

ఒక ఐరోపా బహుళ జాతి సంస్థ కి భారత దేశంలోని హైదరాబాదులో ఒక డెవలప్ మెంట్ సెంటర్ ఉంది. ఆ సంస్థలో సుమారుగా ఒక నూట యాభై మంది దాకా పని చేస్తున్నారు.

అందులో టెస్టర్ ఉద్యోగానికి గత సంవత్సరం “కుమార్” (పేరు మార్చబడినది) ఇంటర్వ్యూకి హాజరయి ఎన్నికయ్యాడు. అతనికి మిగతా వసతులతో బాటే ఆ సంస్థ తాము ఎన్నుకున్న బాంకులో ఒక ఖాతాని తెరిచి పెట్టింది. ప్రతి నెల రెండు, మూడు తారీఖులలోపలే ఆ ఖాతాలోనే అతని జీతం, ప్రోత్సహాకాలు, బోనస్ లు వగైరాలు జమచేస్తున్నది.

బాంక్ ఇచ్చిన డెబిట్ కార్డ్ తో తనకు అవసరమైనప్పుడు అతని తనకి కావలసిన డబ్బుని డ్రా చేసుకునేవాడు. ఆ ఖాతని చూపించి కుమార్ ఒక మోటర్ సైకిల్ ని , ఒక ఆధునికమైన కంప్యూటర్ ని కొనుక్కున్నాడు. మామూలుగా ఋణ సౌకర్యం కలిపించే సంస్థ లు అతని దగ్గిర “పోస్ట్ డెటెడ్” చెక్కులని తీసుకునే ఇచ్చారు. తనకు కావల్సిన మ్యూజిక్ సిస్టం ని కొనుక్కునేటప్పుడు అతని జేబులో డబ్బు సరిపోలేదు. వెంటనే ఆ దగ్గిరలోనే ఉన్న తన బాంక్ ఏ టి ఎం కి వెళ్ళి డబ్బు డ్రా చేసి వారికి ఇచ్చి తన మ్యూజిక్ సిస్టం ని ఇంటికి తెచ్చుకున్నాడు.

సోమ వారం కుమార్ ఆఫీసుకు వెళ్ళలేదు. అతని “లీడ్” కుమార్ కి ఫోన్ చేసి , “ఎందుకని రాలేదు?” అని ఆదిగాడు. నీరసంగా ఉంది అందుకని రాలేకపొతున్నాను అని జవాబిచ్చాడు కుమార్. అతని గొంతులోని నీరసాన్ని గ్రహించిన అతని “లీడ్” జ్వరం ఉందా అని అడిగాడు. “లేదు కాని ..,”అంటూ నసిగాడు కుమార్. లీడ్ రొక్కించి అడిగేటప్పడికి “కుమార్” రెండు రోజులనుంచి ఏమి తినడం లేదు అని చెప్పాడు. “ఏందుకని, ఎమయ్యింది” అని “లీడ్” ఆదుర్దాగా అడిగాడు.

కుమార్ ” డబ్బ్లు లేవు” అని జవాబిచ్చాడు.

“అదేమిటి, జీతం క్రెడిట్ అయ్యిందిగా? మరి ఇంక డబ్బుల ఇబ్బంది ఏముంది?” అని ఆశ్చర్యంగా అడిగాడు.

“ఏ.టి.ఏమ్ . కార్డ్ పోయింది. మరి డబ్బులెలా తీసుకోను” అని అమాయకంగా అడిగాడు, కుమార్.

“చెక్ బుక్ ఉందిగా, చెక్ రాసుకుని తీసుకెళ్ళి ఇవ్వు, వాళ్ళు డబ్బులు ఇస్తారు” అని చెప్పాడు “లీడ్ విస్తుపోతు.

“చెక్ ఎక్కడ ఇవ్వాలి?” అని అడిగాడు కుమార్.

కుమార్ పాతికవేల జీతగాడు. ఇంటర్ లో అతను 94% తో పాస్ అయ్యాడు.

కవిరాజు జయంతి రోజున

ఎవరి కోసం ఈ నిరీక్షణ కవిరాజా?
నీ జయంతి రోజున “నీ” వారందరూ వచ్చి నీన్ను పుష్పమాలంకృతుడ్ని చేసి, తమ అభిమానాన్ని, ప్రేమని, సంఘానికి నీవు చేసిన సేవని పొగిడి, తమ భుజాలని చరుచుకుని వెడతారంటగా?
౧౫ జనవరి రామస్వామి జయంతి రోజు.  మొబైల్‌కి చిరు సందేశం పంపారు.  15 న ఉదయం, ౯ గం॥లకు చిన్న సభ ఆ విగ్రహం దగ్గిరే జరుగుతుంది అని. రామస్వామి కి పూలని కోయడం ఇష్టం ఉండదట. సూతాశ్రమంలో పూల తోట ఉన్నా ఎవరిని పూల ని కోయనిచ్చేవారు కాదంట.  రాలీన పూలని ఏరుకోనిచ్చేవారంట.   వారి అమ్మాయే చెప్పారు నాతో.
నిన్న సాయంత్రం, భాగ్యనగరం లోని టాంక్ బండ్ మీదకి ఎవరినో మిత్రులని కలుద్దామని వెడుతూ, పనిలో పనిగా ఆ విగ్రహాలని చూద్దామని వెళ్ళాను.  ఇలా ఉంది, ఆ విగ్రహం.  శోచనీయం.  స్థూపం మీద అంటీంచిన ఆ కాగితం చూసారా!
ప్రభుత్వంలోని తత్సంభందిత అధికారులు, కనీసం ఆ పెద్దల జయంతి రోజునో, వర్ధంతి రోజునో ఆ విగ్రహాలని శుభ్రం చేసి, కనీసం ఆటు వెళ్ళే వారికి ఆ రోజుని గుర్తు చెయ్యవచ్చు కదా?  భాగ్యనగరంలో ఇన్ని సాంస్కృతిక సంఘాలున్నవి, ఒక చిన్న కార్యక్రమం ఏర్పాటు చెయ్యవచ్చు కదా?

రచయిత – రచన

రచయిత – రచన

జీవితం లో పాల్గొనే ప్రతి వ్యక్తి, ప్రజల్లో సజీవంగా మెలగుతున్న ప్రతి మనిషీ రచయిత కాగలడా? కాడు ! మానవ సమాజం తప్పటడుగులు వేస్తున్నప్పుడు ప్రతి కళాసృష్టి లోనూ సమాజం అంతా పాల్గొనేది. అప్పుడు రచయితకీ ప్రజలకి భేదం లేదు. అలాంటి పరిస్థితుల్లో రచయిత స్వయం ప్రతిభ అనే ప్రశ్నే లేనేలేదు. అప్పుడు ఉత్పత్తి : కొనుగోలులకి భేదం ఉండేది కాదు ఆర్ధికరంగం లో, అదే సాహిత్యంలో కూడా ప్రతిబింబించేది.

అంచేతనే ఆనాటి సాహిత్యంలో అదంతా జానపద సాహిత్యమని జమకట్టవచ్చుచైతన్యం సున్నాగా కనిపించింది; వ్యక్తిత్వం గూడా కనిపించదు. ఐనా ఆ సాహిత్యం లో ఎకాగ్రతఅద్భుతంగా ఉండేది. ప్రకృతికి మనిషికీ జరిగే పోరాటంలోని పరస్పర వైరుధ్యాలు అన్నీ యెత్తిచూపుతూ మానవ యత్నానికి చక్కటి దోహదం యిచ్చేది.

కాని

ఇప్పుడో! రచయితకీ, పఠితకి ప్రత్యక్ష సంబంధం లేదు. రచయిత తాను రచించింది మార్కెట్‌లోకి పంపుతాడు. చదివేవాడు కొనుక్కుని తనగదిలో చదువుకుంటాడు. ఇప్పుడు గూడా మనిషికి ప్రకృతికీ పోరాటం జరుగుతునే ఉంటుంది. రచయిత ఇప్పుడు కూడా మనిషి కొమ్మే కాయాలి. పూర్వం జరిగిన ఫలితమే ఏకాగ్రత – ఇప్పుడు కూడా వ్యక్తులుగా విడిపోయిన పాఠకుల్లో కలగాలి. ఇందుకు పూర్వం సంఘానికి రచయితకి వున్న ప్రత్యక్ష సంబంధమూ , రచనలో ఉన్న సమిష్టి యత్నమూ, పాల్గొనే సమిష్టి ప్రజల స్వార్ధం లో ఉన్న సామ్యము యెక్కువగా సహకరించేవి. ఇదివరకున్న ఆ ప్రత్యక్ష సంబంధం , సమిష్తి యత్నాల స్థానాన్ని, రచయిత స్వయం ప్రతిభ స్వంతం చేసుకోవాలి. ఎవరన్నా ఇదే ఇంస్పిరేషన్‌అన్నా అభ్యంతరం లేదు; అలా అనే వాళ్ళు ఇంస్పిరేషన్‌కి పర్స్పిరేషన్‌ కి బేధం తెలిసినవాళ్ళయితే.

ఆదిమ సాహిత్యానికి పునాదులుగా నిలబడ్డ మంత్రశక్తి, జ్యోతిషమూ, ఆవేశమూ, దూరదృష్టీ, సమిష్టీ స్వార్ధమూ, పూలకం లాంటి ఆవేశమూ, యీనాటి రచయితకి అవసరమే! కాని ఆనాటి మానవుడు ఆదర్శం ప్రధానంగాకుక్షింభరత్వంమాత్రమే! అయితే మానవుడు పురోగమించుతూ అనేక విలువల్ని, గుణపాఠాల్ని నేర్చుకున్నాడు. ఈ అనుభవాలకీ, విలువలకీ, రచయిత వారసుడు కావాలి. కాగా ఆ రచయిత శాస్త్రజ్ఞానమూ, హేతువాదమూ, గతి తార్కిక భౌతిక జ్ఞానమూ, వర్తమానానికి భవిష్యత్తుకీ ఉన్న సంబంధ పరిచయమూ మూర్తీభవించాలీ. ప్రజలకీ నాయకుడికీ ఉన్న భేదమే రచయితలో వివిధ రూపాల్లో కనిపించుంతుంది.

ఒక సందర్భంలో ఇబ్సన్‌ అంటాడు; ప్రశ్నలడగటమ్వరకే నా కర్తవ్యం, వాటికి సమాధానాలు చెప్పడం నా పని గాదు. సమస్య్లని పరిష్కరించడం నా వల్ల అయ్యే పని గాదు. మనుష్యుల్ని, వాళ్ళకుండే విభిన్న గుణగణాల్ని, వీటన్నటిని నిర్ణయించే ఆధునిక సాంఘిక సంబంధాల్నీ, సిధ్హాంతాల్నీ చూపించగలిగితే నేను కృతకృత్యుణ్ణయినట్టే.

ఇంతగా నియమిత ఆదర్శాన్ని ముందుంచుకున్న ఇబ్సన్‌ ప్రముఖ రచయితల్లో ఒకడిగా పరిగణించబడ్డాడు. కాని యీ నాటికి రచయితలూ అదే ఆదర్శంతో రచనా యత్నానికి పూనుకుంటే పప్పులో కాలువేసిన వాళ్ళవుతారు.

ఎంచేతనంటే మనిషి ఇబ్సన్‌ ని వదిలిపెట్టి చాలా ముందుకి వచ్చాడు. ఇబ్సన్‌ రోజుల్లో గందరగోళాల బురదలో మినుకు మినుకు మంటు కనిపించిన సామాజిక సత్యాలూ, సిద్ధాంతాలూ, ఇవ్వాళ్ళ కాళ్ళుని నిలబడ్డాయి. ఇబ్సన్‌ రోజుల్లో మనిషి సాంఘిక సంబంధాలని మరింత గందరగోళం చేసుకుంటూ పురోగమించేవాడు. ఆ గందరగోళాలన్ని ఈ రోజు మురుగు కంపు కొడ్తున్నాయి. ఆధునిక రచయితలు కూడా ఈ గందరగోళం వెనుకవున్న సంఘాన్ని, సాంఘిక సంబంధాన్ని చూడలేక ఈ గందరగోళం సంఘమని, సాంఘిక సంబంధమనీ, వాస్తవమనీ మసక కళ్ళతో చూసి విశ్వసిస్తున్నారు. ఆధునిక రచయిత, అబివృద్ధయిన పరిణామ సిధ్హాంతాన్ని, హేతువాదాన్ని, గతితార్కిక భౌతికవాదాన్నీ కళ్ళజోడుగా పెట్టుకుని, చేయూతగా తీసుకుని, మసకలోనుమంచి, పొగలోనుంచి బయటపడగలగాలి.

ఇలా బయటపడుతున్న రచయితల్లో పరిఢవిల్లే ప్రకాశం, ఆ పొగను, మసకను భేదిస్తాయి. భేదించుతున్న ప్రకాశం మరింత పదునెక్కుతుంది. ఈ ప్రకాశం మృగ్యమైనప్పుడు రచయితకున్న ఇన్స్పిరేషన్ పెర్స్పిరేషన్‌గా తయారవుతుంది. ఇన్స్పిరేషన్ “వేడి” లాంటిది, అనుకుంటే ఆ రాగితీగలో ప్రవహించే సర్వమానవాభ్యుదయ వాంచ్హ అనే విద్యుచక్తి తనలోవున్న “వేడి” నంతటిని సేకరించుకుని అవిరామంగా తిరుగుతూవుంటుంది. తనకంటే బలంగావున్న ప్రకాశంతో కుస్తిపట్టేటప్పుడు అందరికీ ఉపయోగించే వెలుతురు పుట్టుకొస్తుంది. ఇదీ రచయితలలో కనిపించాల్సిన “స్వయంప్రతిభ…”

రచయితలకు పునాదులుగా వుండవల్సిన ఈ “ప్రతిభ” వస్తు నిర్ణయంలోను, సంవిధాన యత్నంలోనూ, కళ్ళకు కట్ట్టినట్లు కనిపించుతుంది. ఇందులో ఎక్కడ లోపమున్న అది రచనలో ఎక్కడో ఒక చోట పొక్కుతుంది.

ఈ స్వయం ప్రతిభని ఉపేక్షించే రచయితలునుద్దేశించేమో టీ.ఎస్.ఇలియట్ అంటాడు:

మేం బోలు మనుషులం

మేం గడ్డిబొమ్మలం

మా వంటి నిండా వరిగడ్డే

మేమేం చెయ్యం? మేమేం చెయ్యగలం?

మేం గుసగులం; మేం గునుస్తాం

మా గుసగుసల్లో, మా గునుకుల్లో వేగం లేదు:

వేడీ లేదు; అర్ధం సున్నా!

మా గొంతుల్లో పొడి

మా పదాలు పగిలిన అద్దాల మీద నడిచే యెలుకల చతుష్పాదాలు

మా పదాలు యెండుగడ్డి కదిపేగాలి పిల్లల కెరటాలు!

ఇలాంటి బోలు మనుష్యులు, గడ్డిబొమ్మలు కావల్సినంత మంది వున్నారు.వీళ్ళు పెద్ద పులుల్తో “సత్యాగ్రహాలు” చేయించగలరు.”స్వర్గానికి నిచ్చేనలు” వేయగలరు. వీళ్ళే సర్వమానవ నాశన కారణాలయ్యే “తుపాను” లు వీయించుతారు. కారణం?

స్వయంప్రతిభ సాధనంవల్ల కలిగేదని వీళ్ళు నమ్మరు. యీ ప్రతిభ, పుట్టుకతోనే కలుగుతుంది కాబట్టి ప్రపంచం యీ ప్రతిభని యీఇనాటికాక్కుంటే రేపటికైనా గుర్తిస్తుందని నమ్ముతారేమో! వీరికున్న ప్రతిభ విలక్షణమైనది. సాధన విపరీతమైనది. వర్తమానాన్ని అర్ధం చేసుకోలేక, భవిష్యత్తువైపు తేరిపారా చూడలేక గతంలో తలదూర్చి బ్రతుకుతుంటారు.

పుట్టుకకి ప్రతిభకి సాపత్యం లేదని, సంబంధం ఉండదని యెవరూ అనరు. కాని అంతటితోనే అది అంతమవుతుందంటే అభ్యంతరం వస్తుంది.

సాహిత్యం కూడ ఒక వృత్తి లాంటిదే. మిగతా వృత్తుల విలువలకి, యీ విలువలకి వ్యత్యాసముంది. నిజమే. కాని మిగతా వృత్తులలో, నైపుణ్యం సంపాదించటం ఎంత కష్టమో, యీ వృత్తిలో ఆరి తేరెందుక్కుడా అంత దీక్షా, సాధనా అవసరమే. ఈ సాధన గడిచిన చరిత్రని, భాషాబేషజాన్ని పరిశీలించి, సొంతం చేసుకున్నంత మాత్రాన సిద్దించేది కాదు. చరిత్ర వెనుకవున్న సత్యాన్ని, భాషకున్న చరిత్రనీ, ప్రయోజనాన్ని గూడా గుర్తించగలగాలి. ఇదంతా సమకూడాలంటే యెడతెగని కృషి వుండాలి.

ఇందుకు రచయితలందరు కృషికున్న విలువని గుర్తించాలి; కృషి అంటే వున్న చిన్నచూపుని సంస్కరించుకోవాలి. రచయిత కూడ కొన్ని హద్దులో కార్మికుడేనన్న విషయాన్ని మరిచిపోగూడదు. అప్పుడే కష్టజీవుల అండని నిలబడటంలో వున్న గౌరవం అర్ధమౌతుంది. అప్పుడు గాని ఈట్స్ అన్న మాటల్లోని యదార్ధం అవగతం కాదు; ” You must learn your trade.”

రచయిత – రచనలు
మీద కీ..శే అట్లూరి పిచేశ్వరరావు అభిప్రాయాలు

సృజనాత్మకం

ఆ తల్లి పిల్లల్ని పోషించే విధిని నిర్వహించలేనట్లే, పెద్ద మనిషిసాంఘిక చైతన్యానికి దారి చూపలేడు.

సంఘంలో చైతన్యం కలగాలంటే, సృజనాత్మక రచనలు కావాలి. సృజనాత్మక రచనలు, సంఘంలో చైతన్యాన్ని విద్యుద్దిపించాలాంటే, సాంఘిక సంసృతీ సంప్రదాయాలు అందులో సంలీనం కావాలి. మన సాంఘిక ప్రాచీన జీవితంలోని చచ్చుపుచ్చుల్ని దులిపి, కడిగి, యేరి, సజీవభాషనూ, రూపాల్ని, సాంకేతికాలనూ స్వీయం చేసుకోవాలి. అప్పుడుగాని ప్రజల హృదయతంత్రుల్ని మీటి సంగీతాన్ని పలికించలేము.

ఈనాడు గలగల తొణికే విషాదాశ్రువుల్ని , కణకణ మండే విలాపాగ్నూలని, సాహిత్య రూపాల్లో సాక్షాత్కరింపజేసుకోవాలి. దారిద్ర్యాలను పరిష్కరిస్తూ, దౌర్జన్యాలను బహిష్కరించే బాటలకు రూపులు దిద్దాలి.

వ్యదార్థజీవితాల యధార్ధాన్ని చిత్రిస్తూ, సంఘానికి భవిష్యత్తు చూపే సోపానాలను నిర్మించుకుంటూ సంఘం అంతా హర్షాన్ని పూచేట్లు చేసుకోవాలి.

అదే ప్రజా సాహిత్యం. ప్రజాసామాన్యం అంతా నిరక్షరాస్యులుగా వున్న మధ్య యుగాలలో గూడా ఉత్తమ సాహిత్య రూపాలు ప్రసిద్ధి కెక్కాయి. ఆ నాటికి నియమితమైన సాహిత్య చైతన్యంతో, ప్రజాజీవితాన్ని తరచి, ప్రజలిని కలవరపరచిన సమస్యల్ని వారి హృదయాలకు హత్తుకునేట్లు చిత్రించిన సంస్కృతీ రూపాల్నీ, ఈ నిరక్షరాస్యులైన ప్రజలే అత్తారు బలంగా దాచుకుని, ఆనందించారు; ఈనాడు అంతే.

బుధనిర్వచనం
నిరక్షరాస్యుడు: కుక్షి కోసం చక్షువులు మూసుకునే మనిషి.

అట్లూరి పిచ్చేశ్వర రావు

పర్సనల్ సెక్రటరి కావాలి!

హైదరాబాదు నుండి ప్రచురింపబడే ఒక ప్రముఖ దిన పత్రికలో పని చెయ్యడానికి ఒక పర్సనల్ సెక్రటరి కావాలి.

20 – 25 ఏళ్ళ వయసున్న యువతి అప్లై చెయ్యవచ్చు.
పట్టభద్రురాలై ఉండాలి.
చక్కటి తెలుగు తెలిసిఉండాలి.
తెలుగు ఇంగ్లిష్‌లో స్వయంగా ఉత్తరప్రత్యుత్తరాలు జరపగల నైపుణ్యం ఉండాలి.
మాములుగా ప్రతి ఆఫీసులోను ఉన్నట్టే ఫోన్లు అందుకోవాలి.అపాఇంట్మెంట్‌లు, వచ్చిన విజిటర్స్‌ని సాదరంగా రిసీవ్ చేసుకోవడం కొన్ని బాధ్యతలు మాత్రమే!

ఉదయం 9-30 నుండి సాయంత్రం 6 ఇంటిదాకా పని వేళలు.

సుమారు గా ఐదువేలవరకు నెలసరి జీతం ఉంటుంది.
అనుభవజ్ఞులకి ఇంకా ఎక్కువ జీతానికి అవకాశం ఉంటుంది.

మీకు అసక్తి ఉంటే, మీ రెజ్యుమేని [email protected] కి పంపండి.
సబ్జెక్ట్ లైనులో: Secretary – ED అని వ్రాయడం గుర్తుంచుకోండి.
మీకు తెలిసినవారేవారెవరన్నా అర్హులని మీరనుకుంటే వారికి కూడా తెలియజేయ్యమని విన్నపం.

అంతర్జాలం (Internet)లో వెదకడానికి కిటుకులు

లో మనం ఉద్యోగంలో చేరుదాం అనుకున్నప్పుడు ఆ కార్పరేట్ సంస్థ గురించి ఎలా తెలుసుకోవచ్చు అన్నది ప్రస్తావన. దానికి గతంలోనే వివరంగా వెబ్ సైట్స్ తో బాటు చాలా సమాచారం ఇచ్చాను. ఇక్కడ అవి కాకుండా గూగుల్ శోధనతో ఎలా తెలుసుకోవచ్చు అన్నవాటికి రెండు ఈ-బుక్స్‌ని ఇచ్చాను. ఈ కిటుకుల ద్వారా మీరు గూగుల్‌ని మరింత సమర్ధవంతంగా ఉపయోగించుకుని లాభిస్తారని అశిస్తున్నాను.
గూగుల్ సెర్చ్‌ని శక్తివంతంగా ఉపయోగించడానికి (తెలుగులొ) ఇక్కడ చూడండి.
దీనిని అందించిన వారు: శ్రీధర్ చందుపట్ల
శ్రీధర్ చందుపట్ల గారికి కృతజ్ఞతలు.
గూగుల్లో వెదకడానికి గూగుల్‌వారి గైడ్ (ఇంగ్లిష్‌లో) ఇక్కడ చూడండి.
ఇక్కడ పై రెండు ఫైల్సు మీరు డవున్‌లోడ్ కూడా చేసుకోవచ్చు.
రెండు ఉచితమే!

Assistant Editor – వెం‌టనే కావాలి


జనవరిలో ప్రారంభంకానున్న ఒక దినపత్రికకు అనుబంధంగా ప్రారంభించబడుతున్న web portal కి Assistant Editor కావాలి.

తెలుగు బాగా వచ్చా?
English ఇంకా బాగా వచ్చా?
అరె! మీకొసమే ఎదురుచూస్తున్నాము!

అంతర్జాలం దానికి సంభందించిన విషయాలమీద పూర్తి అవగాహన ఉందా? Portal సు వాటి content మీద మీకంటు కొంత స్వంత అభిప్రాయాలున్నవా? అవి పంచుకోగలరా? అనుభవం కూడా వుందా?
అయ్యొ. మరి ఇంకా అక్కడే నిలబడ్డారేం?

మీకు దాదాపు పాతికేళ్ళ వయసుందా?
ఐతే మీరు అర్హులే!

కనీసం graduation పూర్తి గావించారా?
ఐతే మరి ఇంక ఆలస్యం ఎందుకు?
అప్లై చెయ్యండి!

పగలే నండి ఉద్యోగం. Portal అన్నాంగదా?

జీతం ఎంతంటారా?
మీ ఉత్సాహము, అనుభవాన్నిబట్టి కనీసం నెలకి పది, పదిహేను వేల మధ్య ఉంటుంది?

ఉద్యోగం ఎక్కడంటారా?
భాగ్యనగరంలోనే!

మీకీ ఉద్యోగ అఖర్లేదా?
సరే మీకు తెలిసిన వాళ్ళు, అవసరం ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే వారికి చెప్పి అప్లై చెయ్యమనండి.

ఫొనెందుకండి?

careers AT thus dot in కి
Subject లైన్‌లో Assistant Editor
అని వ్రాసి మీ అప్లికేషన్ పంపండి.

* reference ఇస్తే బాగుంటుంది. మా పనిని సులభంగా చేసుకోగలుగుతాం!

ప్రతి అప్లికెషన్‌కి జవాబు ఉంటుంది.
Waiting లొ పెట్టం.