అన్వర్ కి ధాంక్స్‌తో..

ఆదివారం.  మార్చ్ 2, 2014. మళ్ళీ SMS.  ఆర్టిస్ట్ మోహన్ గారి పిలుపు.  మనవాళ్లందరూ వస్తున్నారు.  మీరు కూడా రావాలి.  మన శేఖర్ కి మనం చెయ్యాలి! సందర్భం శేఖర్ కార్టూనిస్ట్‌గా గోల్డెన్ జూబిలి సెలబ్రేషన్.

శేఖర్ కార్టూనిస్ట్ గా నే పరిచయం అయ్యాడు  ఆంధ్రజ్యోతి లో.  కె.పి డెస్క్ పక్కనే.  కె.పి ని దాటుకుని శేఖర్ డెస్క్‌కి వెళ్ళాలి.  ఆ పక్కనే వసంతలక్ష్మి గారి డెస్క్.

కినిగె కి తన కార్టూన్ పుస్తకాన్ని ఇచ్చిన తొలి కార్టూనిస్టు శేఖర్.  అదొక అభిమానం.  తరువాత ఎప్పుడో ఒకసారి నా మీద కోపగించుకున్నాడు కూడా!  “నాకు మీరు పిచ్చేశ్వరరావు గారి అబ్బాయని ఎందుకు చెప్పలేదు.  ఆయనంటే మా తరానికి ఎంత ఇష్టమో, మీకు తెలియదు. అటువంటి వాళ్ళు అంత త్వరగా వెళ్ళిపోవాడనికి హడావుడి ఏమిటో?” అనుకున్నడు స్వగతంగా.

అమెరికా సంయుక్త రాష్ట్రాలకి వెళ్లబోయేముందు, వెళ్ళి వచ్చిన తరువాత తన పుస్తకాన్ని డిజిటల్ బుక్‌గా ఎలా డిజైన్‌చేస్తే బాగుంటుందో అని కలిసినప్పుడు మాట్లాడుకునేవాళ్ళం.  కలవనప్పుడు ఫోన్ చేసేవాడు.  ఫోనులో “తింటున్నాన్నా?” అని అడిగి నవ్వేవాడు.

“సార్, మీ ఇంటికి దగ్గిర్లోకి మారుతున్నాను. మనం ఇక రోజు కలుసుకోవచ్చు.  బహుశ నేనే మీ ఇంటికి వస్తాను.  కలిసి టీ తాగోచ్చు,” అని ఎంతో సంతోషంగా నవ్వుతూ చెప్పినప్పుడు ఆనందమేసింది.

తరువాత ఎప్పుడో తెలిసింది..ఆరోగ్యం బాగోలేదని.  ఇంటికి వెళ్ళి పలకరించాలని అనుకునేటప్పడికి ఇల్లు మారడం కూడా ఐపోయింది.

Cartoonist Chandrasekher
Cartoonist Chandrasekher (Jul 16, 1965 – 19 May 2014)

ఆదివారం ఉదయం సోమాజిగూడ ప్రెస్ ‌క్లబ్‌లో అతని కోసం చూసాను.  కొంచెం ఆలస్యం అయ్యింది నేను వెళ్ళేటప్పటికి.  మనిషి కనబడలేదు.  వెతుకున్నాను.  కాప్..నోటికి మాస్క్ అడ్డం ఉంది.  ఆ మాస్క్ పైన కళ్ళు. నవ్వు.  ఉగ్గబట్టుకున్న ఆనందం.  సంతోషం.  ప్రెస్‌క్లబ్ నిండిపోయింది.  కాని మనిషిని చూసిన నేను ఖంగు తిన్నాను.  నాకు తెలిసిన శేఖర్ రూపు కాదది.  మనిషి మొఖంలో విపరీతమైన అలసట. సగం అయిపొయ్యాడు.  ఎందుకో ఉండబుద్ది కాలేదక్కడ.  తనతో మాట్లాడడానికి తగిన ప్రదేశమూ కాదు..సందర్భమూ కాదు.  ఈ లోపు ఒకటికి రెండు సార్లు ఫోను చేసిన అన్వర్, sms లు గుప్పించిన ఇతర మిత్రులని పలకరించాను.

హడావుడిగా పరిచయుస్థుడొకాయన వచ్చాడు.  పక్కనే శ్రీమతి అనుకుంటాను.  పేద్ద పూలమాల.  ఒక పుష్ఫగుచ్చం.  హడావుడి హడావుడిగా వేదిక దగ్గిరకు దాదాపుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపొయ్యారు.  ఆఖరి చూపు.  పార్ధివ శరీరాన్ని పుష్పమాలంకృతాన్ని చెయ్యాలన్న తాపత్రయం కనపడింది ఆ వేగంలో, ఆ మాటల్లో, ఆ గమనంలో.  విరక్తి పుట్టింది.

విజయవాడలో “మో” హాస్పిటల్‌లో ఉంటే..”సార్,  ఐపోయ్యిందా?  డిక్లేర్ చేసేద్దామా”?   అని స్ట్రింగర్స్ శ్రీ శ్రీ విశ్వేశ్వరావు గారిని పీక్కు తిన్న వైనం గుర్తోచ్చింది.  మనసు రోసింది. అసహ్యం వేసింది. రోత పుట్టింది.

వెళ్ళిపోదామని వెనక్కి తిరుగుతుంటే..అన్వర్ ఎదురువచ్చాడు.  “సార్, వెళ్ళిపోతున్నారా?” అంటూ. ఔనన్నట్టుగా తలూపూతూ గేటు వైపుకి కదులుతుంటే..”వుండండి సార్..రెండు మాటలు మాట్లాడి వెళ్లండి”  అని అన్నాడు.  వాళ్ళ మధ్య నేనేమి మాట్లాడుతాను అనుకుంటూ నిలబడిపొయ్యాను.  “ఉండండి సార్.  ఒక్క రెండు మాటలు మాట్లాడండి.  తనుకూడా వింటాడు కదా?”అని అన్నాడు. ఇక ఆ మాటకు తిరుగులేదు.  సరే అని ఆగి పొయ్యాను.

ఈ లోపు మాట్లాడేవాళ్ళున్నారు.  వాళ్ళ తరువాత..అన్వర్ నాకు మైకు ఇప్పించాడు.  శేఖర్ వెనకకి చేరుకున్నాను.  శేఖర్ భుజం మీద చెయ్యి వేసాను.  శేఖర్ నా ముఖంలోకి చూసాడు.  మా ఇద్దరి కళ్ళు కలిసినవి.  He knows.  He knew, I knew. He also knew that my heart is with him. I wished him all the best with all my heart.  I expressed my good wishes to all his frineds for supporting him at that time. లేచి నిలబడ్డాడు.  కౌగలించుకున్నాడు.  That was the parting embrace. I knew.

మైక్ ఆర్టిస్టు మోహన్ గారికిచ్చాను.  అన్వర్ కి థాంక్స్ చెప్పాను.  వచ్చేసాను.

మా అమ్మ పోయినప్పుడు చలసాని ప్రసాదరావు గారు రాలేదు.  దానికి ఆయన చెప్పిన కారణం.  “నాకు మీ అమ్మ చక్కగా సంతోషం గా నవ్వుతూ ఉన్నప్పుడు చూసిన జ్ఞాపకం.  నాకు అదే గుర్తుంచుకోవాలని ఉంది” అని.
చంద్రశేఖర్ విషయం లో నాది అదే ఉద్దేశం. అందుకే కొడుకు పెళ్ళికి వెళ్ళలేక పొయ్యాను.  ఈ రోజు వెళ్ళడం లేదు.  ఫోటో కూడ తను నవ్వుతున్నదే పెట్టాను.

ఆ రోజున అన్వర్ నన్ను గుర్తుపెట్టుకుని పిలవకపొతే..నాకు శేఖర్ చిరు దరహసం అందేది కాదు.

గుడ్‌బై శేఖర్.  You are a good friend.  I shall remember your smile.  Always.

ఇది వ్యాపారం కాదు.  నేను ఇప్పుడు కినిగె లో లేను కూడా!  శేఖర్ పుస్తకాలు ఇవి కొన్ని అని చెప్పడానికి మాత్రమే:  http://kinige.com/author/Shekar

ఇది జీవితమే…కథ కాదు

చదివిన కొన్ని వేల పుస్తకాలనుండి, అక్కడొక అధ్యాయం, ఇక్కడొక పేజి, మరెక్కడినుండో ఒక పేరా, మరో చోట నుండి ఒక పదబంధం తో అద్భుతమైన అనుభవాలతో ఏర్చి కూర్చిన పూలదండ కాదిది.

శిల్పం, శైలి, ప్రక్రియలతో కథనంకు కావల్సిన దినుసులతో పాఠకులను అలరించాలని వండి వార్చినది అంతకంటే కాదు.  వారేవరో అడిగినట్టు..ఒక మంచి సంపాదకుడు చెక్కిన శిల్పం అసలే కాదు.

జీవితం అలవోకగా, నిర్లక్షంగా, విదిల్చిన గాజుపెంకులు హృదయపు మాంసపు ముద్దలమీద గీసిన గాట్లనుండి, స్రవిస్తున్న రక్తపుబొట్లతో తడిచి పోతున్న పచ్చి గాయాలనుండి జారి పడిన మాటలివి.
ఆఫ్సర్ కి కృతజ్ఞతలతో..
పాదసూచికః ౩౧ మార్చ్ ౨౦౧౭ తో బహశ సారంగ సర్వర్స్ డౌన్ అయిపోతాయి. అందుకని నా స్వంత గూగుల్ డైవ్ కి ౨౮ మార్చ్ న లంకె ఇఛ్హాను.

మై డాడ్ డైడ్ యంగ్

Pitcheswara Rao Atluri (1924 – 1966)

అట్లూరి పిచ్చేశ్వర రావు (1924 -1966)

రచయిత, కథకుడు, నవలాకారుడు,అనువాదకుడు, చలన చిత్ర సంభాషణ కర్త

వికిపిడియలో పిచ్చేశ్చర రావు

ఆయన వ్రాసినవి కొన్ని ఇక్కడ

తెలుగు దిన పత్రిక సాక్షి లో

విన్నవి – కన్నవి

వ్యాసం  ఆంధ్రప్రభ వార పత్రిక లో (౧౯౬౯) ప్రచురితం

34. విన్నవి – కన్నవి

వివిధ జీవిత రంగాలమీద వ్యాఖ్యానిస్తూ, విమర్శలు చేస్తూ తెలుగులో చాలా సాహిత్యం వచ్చింది. అయితే మన బుక్ పబ్లిషర్లు ఇలాంటి సాహిత్యాన్ని పుస్తక రూపంలో వెలువరించటానికి అంతగా ఆసక్తి చూపటం లేదు. దానికి మార్కెట్ లేదని వారి ఉద్దేశం కావచ్చు. అలా అయితే అది అపోహే. కిందటి నెల విడుదలయిన చిత్రాలు చాలా భాగం ఈ నెలలో నామరూపాలు లేకుండా పోయినట్టే, కిందటేడు విడుదల అయిన కల్పనా సాహిత్యం కొంత ఈ ఏటికి కనుచూపుమేరలో లేకుండా పోతున్నది. కాని పుస్తకరూపంలో వెలువడిన వ్యాసావళి – ప్రత్యేకించి
‘కన్నవీ – విన్నవీ’ లాటిది ఎంతకాలమేనా బతికి ఉంటుంది.

అందుకు వేరే నిరద్శనం అవసరం లేదు. ఈ చిన్న పుస్తకంలో తరిచిన అనేక విషయాలు విస్మృత చరిత్రా, విస్మృత సంఘటనలూను. అయినా వాటి మీద పిచ్చేశ్వరరావు వ్యాఖ్యానాలు అశోకుడి శిలాశాసనాల్లాగా ఎంతకాలమైనా నిలిచేవిగా ఉన్నాయి.

ఈ పుస్తకంలో ప్రస్తావించిన కొన్ని విషయాలు :
♦ ఈనాడు రచయితకీ, పఠితలకీ ఉండవలసిన సంబంధం.
♦ మనిషికీ, జంతువులకూ ఉన్న(లేక, లేని) తేడా.
♦ అభ్యుదయ నిరోధకులకు మంచి సాహిత్యం పట్ల ఉండే ద్వేషం.
♦ ఈనాడు వెలువడే చౌకబారు సాహిత్యం.
♦ విద్యార్థులూ, రాజకీయాలూ (!)
♦ చార్లీ చాప్లిన్ పట్ల అమెరికా వైఖరి.

పుస్తకంలో ఉన్నవి 11 వ్యాసాలే అయినా అందులో ఇన్ని విషయాలు చర్చించబడ్డాయి.  ఆ చర్చలో ఈ నాటికీ మనం గ్రహించవలిసిన విషయాలు ఎన్నయినా ఉన్నాయి.

“ముక్కుపచ్చలారని నవ్యాంధ్ర రాష్ట్ర శిశువు మూలుగుతూ మూలనున్న ముసలాడి వధువు అవుతూంటే, చూస్తూ ఊరుకుని కీటక సన్యాసుల్లాగా….. గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్న కొంతమంది…” ఈనాడు లేరా ?

“భడవల దారిన పోయేందుకే బ్రహ్మాండ శక్తులూ అవసరం లేదు” అన్నది మనం నిత్యమూ స్మరించదగిన విషయం కాదా?

“ఇండియా ఇంకా (1954 జనవరి 26 నాటికి) కామన్వెల్తులోనే ఉంది. వెల్త్ గూడ కొద్ది మంది అనే కామన్ మనుష్యుల గుప్పెట్లోనే ఉంది!” అన్నదానికి ఈ 15 సంవత్సరాలలో మార్పేమన్నా వచ్చిందా?

“ప్రజలతో ప్రత్యక్ష సంబంధం లేని రచయిత, వాళ్ళ సమస్యల్నీ, వాళ్ల పోరాటాల్నీ, అనుభవాల్ని పత్రికల్లో చదివి, ఎంతో సానుభూతితో ఆలోచించుతున్నాను అనుకునే రచయిత ఎంతవరకు ప్రజాసాహిత్యాన్ని సృష్టించగలుగుతాడు? అనేది ఒక పెద్ద ప్రశ్న ” – ఇప్పటికీ, ఎప్పటికీని.

“పోరాటం లేనిదే పురోగమనం లేదు – ఇంటా, బయటా కూడా.” అయినా మనం పురోగమనాన్ని ఇంకా శాంతిలోనే వెతుకుతున్నాం!

సాహిత్య వ్యాసాలు
పుట – 559

“ఫ్రాంకో, హిట్లర్, గోబెల్స్, ముసోలినీలూ…….. ఈ డాలరుమార్కు ప్రజాస్వామ్యం కంటే ముందే ఈ ఘనకార్యాన్ని ( ఉత్తమ సాహిత్యాన్ని నిషేధించటాన్ని) కొనసాగించాలని చూశారు. ” డాలరు మార్కు ప్రజాస్వామ్యం ఈనాడు ఇంకా వెర్రితలలు వేస్తున్నది.

“చాప్లిన్ అమెరికాలో ఆడుగుపెట్టేందుకు అర్హుడౌనా ? కాదా? అనేది సమస్య కానే కాదు చాప్లిన్ లాంటి ఉత్కృష్ట కళాకారులు ఉండదగిన దేశమేనా అమెరికా?’ చాప్లిన్ అనంతరం మరికొందరు ప్రముఖులకు అమెరికాలో చోటు లేకుండా పోయింది.

“విద్యార్థి ఉద్యమాలు ప్రజాచైతన్యానికి చూపుడు వ్రేలు లాంటివి. ప్రభుత్వ దమన నీతికి థర్మామీటర్లు” – ఇవాళ కూడాను.

“ప్రభుత్వం ఎవరిదైనా – 1857 లో గద్దె మీద ఉన్నవారికి పట్టిన గతే, 1953 లో గద్దెమీద కూర్చున్న వారికి కూడా తప్పదని గడచిన చరిత్రతో బాటు, నడిచే చరిత్రగూడ సూచిస్తుంది.” ఈనాడు నడిచే చరిత్ర ఈ మాటను మరింత బాగా రుజువు చేస్తున్నది.  “అమెరికా నుంచి ఎగుమతై, వందలకొద్దీ థియేటర్లలో ప్రదర్శితమయ్యే తుక్కు చిత్రాల మాటేమిటి? ఈ చిత్రాలన్నీ తుక్కు అనీ, బూతుల పుట్టలనీ ఈ మంత్రులే అన్నారే.” “తుక్కు – బూతు” చిత్రాలు దేశవాళీ పరిశ్రమగా రూపొందటం కళ్లారా చూసి అనందించటానికి పిచ్చేశ్వర్రావు బ్రతికి ఉండవలిసింది.

అతను 40 ఏళ్లకే అకాలమరణం పాలుకాకుండా ఉన్నట్టయితే ఈనాటి జీవితాన్ని ఎలా విమర్శించి, తూర్పారబట్టి ఉండేవాడో! దేశంలో అభ్యుదయ భావాలూ, అభ్యుదయ దృక్పథమూ గలవారు చాలా మంది ఉన్నారు. కాని “కసిస్టెంటుగా ”తాను తరిచే ప్రతి విషయంలోనూ ఒక తప్పటడుగు లేకుండా నిజాన్ని అందరికీ అవగాహన అయేటట్టు చూపటం గొప్ప ప్రతిభ. అంతేకాదు. పిచ్చేశ్వర్రావు ప్రతి ప్రత్యక్ష సమస్యలోనూ శాశ్వతత్వం
కూడిన నిజాన్ని ఇట్టే పట్టెయ్యగల శక్తిని ప్రదర్శించాడు. అది చాలా అరుదైన శక్తి. తాను ప్రకటించే నిజాన్ని పదిమంది నోటా విని ఆమోదించటంతో తృప్తిపడక, తనకు తానుగా చాలా దీర్ఘంగా ఆలోచించేవాడు; ఇతరులతో చర్చించేవాడు. అదే అతనిలో బలం. ముందు చెప్పిన 11 వ్యాసాలు గాక ఈ పుస్తకంలో రెండు కథానువాదాలూ, బెర్టోల్ బ్రెస్ట్
నాటక సిద్ధాంతం మీద ఒక వ్యాసమూ ఉన్నాయి. కథానువాదాలను గురించి ప్రత్యేకంగా చెప్పకోవలిసిందేమీ లేదు.

గాని, బ్రెస్ట్ గురించి పిచ్చేశ్వరరావు ఏనాడో రాసి ఉండటం గమనార్హం. ఎందుచేతంటే నా టక తత్వమూ, నాట్యకళా విప్లవ పూరితమైనవి. అతని సిద్ధాంతాలు అన్ని దేశాలవారినీ ఆకర్షించాయి. మన దేశంలో కూడా కొందరు మేధావులు బ్రెస్ట్ నాటకాలను హిందీలోకి అనువదించి ప్రదర్శిస్తున్నారు. బ్రెస్ట్ విషయం తెలుగు పాఠకులకోసం పిచ్చేశ్వర్రావు వేసిన బాటను ఇతరులు నడవకపోవటం శోచనీయమే.

ఆంధ్రప్రభ, వారపత్రిక, 18-6-1969
560
కొకు వ్యాసప్రపంచం – 5

రచయిత – రచన

రచయిత – రచన

జీవితం లో పాల్గొనే ప్రతి వ్యక్తి, ప్రజల్లో సజీవంగా మెలగుతున్న ప్రతి మనిషీ రచయిత కాగలడా? కాడు ! మానవ సమాజం తప్పటడుగులు వేస్తున్నప్పుడు ప్రతి కళాసృష్టి లోనూ సమాజం అంతా పాల్గొనేది. అప్పుడు రచయితకీ ప్రజలకి భేదం లేదు. అలాంటి పరిస్థితుల్లో రచయిత స్వయం ప్రతిభ అనే ప్రశ్నే లేనేలేదు. అప్పుడు ఉత్పత్తి : కొనుగోలులకి భేదం ఉండేది కాదు ఆర్ధికరంగం లో, అదే సాహిత్యంలో కూడా ప్రతిబింబించేది.

అంచేతనే ఆనాటి సాహిత్యంలో అదంతా జానపద సాహిత్యమని జమకట్టవచ్చుచైతన్యం సున్నాగా కనిపించింది; వ్యక్తిత్వం గూడా కనిపించదు. ఐనా ఆ సాహిత్యం లో ఎకాగ్రతఅద్భుతంగా ఉండేది. ప్రకృతికి మనిషికీ జరిగే పోరాటంలోని పరస్పర వైరుధ్యాలు అన్నీ యెత్తిచూపుతూ మానవ యత్నానికి చక్కటి దోహదం యిచ్చేది.

కాని

ఇప్పుడో! రచయితకీ, పఠితకి ప్రత్యక్ష సంబంధం లేదు. రచయిత తాను రచించింది మార్కెట్‌లోకి పంపుతాడు. చదివేవాడు కొనుక్కుని తనగదిలో చదువుకుంటాడు. ఇప్పుడు గూడా మనిషికి ప్రకృతికీ పోరాటం జరుగుతునే ఉంటుంది. రచయిత ఇప్పుడు కూడా మనిషి కొమ్మే కాయాలి. పూర్వం జరిగిన ఫలితమే ఏకాగ్రత – ఇప్పుడు కూడా వ్యక్తులుగా విడిపోయిన పాఠకుల్లో కలగాలి. ఇందుకు పూర్వం సంఘానికి రచయితకి వున్న ప్రత్యక్ష సంబంధమూ , రచనలో ఉన్న సమిష్టి యత్నమూ, పాల్గొనే సమిష్టి ప్రజల స్వార్ధం లో ఉన్న సామ్యము యెక్కువగా సహకరించేవి. ఇదివరకున్న ఆ ప్రత్యక్ష సంబంధం , సమిష్తి యత్నాల స్థానాన్ని, రచయిత స్వయం ప్రతిభ స్వంతం చేసుకోవాలి. ఎవరన్నా ఇదే ఇంస్పిరేషన్‌అన్నా అభ్యంతరం లేదు; అలా అనే వాళ్ళు ఇంస్పిరేషన్‌కి పర్స్పిరేషన్‌ కి బేధం తెలిసినవాళ్ళయితే.

ఆదిమ సాహిత్యానికి పునాదులుగా నిలబడ్డ మంత్రశక్తి, జ్యోతిషమూ, ఆవేశమూ, దూరదృష్టీ, సమిష్టీ స్వార్ధమూ, పూలకం లాంటి ఆవేశమూ, యీనాటి రచయితకి అవసరమే! కాని ఆనాటి మానవుడు ఆదర్శం ప్రధానంగాకుక్షింభరత్వంమాత్రమే! అయితే మానవుడు పురోగమించుతూ అనేక విలువల్ని, గుణపాఠాల్ని నేర్చుకున్నాడు. ఈ అనుభవాలకీ, విలువలకీ, రచయిత వారసుడు కావాలి. కాగా ఆ రచయిత శాస్త్రజ్ఞానమూ, హేతువాదమూ, గతి తార్కిక భౌతిక జ్ఞానమూ, వర్తమానానికి భవిష్యత్తుకీ ఉన్న సంబంధ పరిచయమూ మూర్తీభవించాలీ. ప్రజలకీ నాయకుడికీ ఉన్న భేదమే రచయితలో వివిధ రూపాల్లో కనిపించుంతుంది.

ఒక సందర్భంలో ఇబ్సన్‌ అంటాడు; ప్రశ్నలడగటమ్వరకే నా కర్తవ్యం, వాటికి సమాధానాలు చెప్పడం నా పని గాదు. సమస్య్లని పరిష్కరించడం నా వల్ల అయ్యే పని గాదు. మనుష్యుల్ని, వాళ్ళకుండే విభిన్న గుణగణాల్ని, వీటన్నటిని నిర్ణయించే ఆధునిక సాంఘిక సంబంధాల్నీ, సిధ్హాంతాల్నీ చూపించగలిగితే నేను కృతకృత్యుణ్ణయినట్టే.

ఇంతగా నియమిత ఆదర్శాన్ని ముందుంచుకున్న ఇబ్సన్‌ ప్రముఖ రచయితల్లో ఒకడిగా పరిగణించబడ్డాడు. కాని యీ నాటికి రచయితలూ అదే ఆదర్శంతో రచనా యత్నానికి పూనుకుంటే పప్పులో కాలువేసిన వాళ్ళవుతారు.

ఎంచేతనంటే మనిషి ఇబ్సన్‌ ని వదిలిపెట్టి చాలా ముందుకి వచ్చాడు. ఇబ్సన్‌ రోజుల్లో గందరగోళాల బురదలో మినుకు మినుకు మంటు కనిపించిన సామాజిక సత్యాలూ, సిద్ధాంతాలూ, ఇవ్వాళ్ళ కాళ్ళుని నిలబడ్డాయి. ఇబ్సన్‌ రోజుల్లో మనిషి సాంఘిక సంబంధాలని మరింత గందరగోళం చేసుకుంటూ పురోగమించేవాడు. ఆ గందరగోళాలన్ని ఈ రోజు మురుగు కంపు కొడ్తున్నాయి. ఆధునిక రచయితలు కూడా ఈ గందరగోళం వెనుకవున్న సంఘాన్ని, సాంఘిక సంబంధాన్ని చూడలేక ఈ గందరగోళం సంఘమని, సాంఘిక సంబంధమనీ, వాస్తవమనీ మసక కళ్ళతో చూసి విశ్వసిస్తున్నారు. ఆధునిక రచయిత, అబివృద్ధయిన పరిణామ సిధ్హాంతాన్ని, హేతువాదాన్ని, గతితార్కిక భౌతికవాదాన్నీ కళ్ళజోడుగా పెట్టుకుని, చేయూతగా తీసుకుని, మసకలోనుమంచి, పొగలోనుంచి బయటపడగలగాలి.

ఇలా బయటపడుతున్న రచయితల్లో పరిఢవిల్లే ప్రకాశం, ఆ పొగను, మసకను భేదిస్తాయి. భేదించుతున్న ప్రకాశం మరింత పదునెక్కుతుంది. ఈ ప్రకాశం మృగ్యమైనప్పుడు రచయితకున్న ఇన్స్పిరేషన్ పెర్స్పిరేషన్‌గా తయారవుతుంది. ఇన్స్పిరేషన్ “వేడి” లాంటిది, అనుకుంటే ఆ రాగితీగలో ప్రవహించే సర్వమానవాభ్యుదయ వాంచ్హ అనే విద్యుచక్తి తనలోవున్న “వేడి” నంతటిని సేకరించుకుని అవిరామంగా తిరుగుతూవుంటుంది. తనకంటే బలంగావున్న ప్రకాశంతో కుస్తిపట్టేటప్పుడు అందరికీ ఉపయోగించే వెలుతురు పుట్టుకొస్తుంది. ఇదీ రచయితలలో కనిపించాల్సిన “స్వయంప్రతిభ…”

రచయితలకు పునాదులుగా వుండవల్సిన ఈ “ప్రతిభ” వస్తు నిర్ణయంలోను, సంవిధాన యత్నంలోనూ, కళ్ళకు కట్ట్టినట్లు కనిపించుతుంది. ఇందులో ఎక్కడ లోపమున్న అది రచనలో ఎక్కడో ఒక చోట పొక్కుతుంది.

ఈ స్వయం ప్రతిభని ఉపేక్షించే రచయితలునుద్దేశించేమో టీ.ఎస్.ఇలియట్ అంటాడు:

మేం బోలు మనుషులం

మేం గడ్డిబొమ్మలం

మా వంటి నిండా వరిగడ్డే

మేమేం చెయ్యం? మేమేం చెయ్యగలం?

మేం గుసగులం; మేం గునుస్తాం

మా గుసగుసల్లో, మా గునుకుల్లో వేగం లేదు:

వేడీ లేదు; అర్ధం సున్నా!

మా గొంతుల్లో పొడి

మా పదాలు పగిలిన అద్దాల మీద నడిచే యెలుకల చతుష్పాదాలు

మా పదాలు యెండుగడ్డి కదిపేగాలి పిల్లల కెరటాలు!

ఇలాంటి బోలు మనుష్యులు, గడ్డిబొమ్మలు కావల్సినంత మంది వున్నారు.వీళ్ళు పెద్ద పులుల్తో “సత్యాగ్రహాలు” చేయించగలరు.”స్వర్గానికి నిచ్చేనలు” వేయగలరు. వీళ్ళే సర్వమానవ నాశన కారణాలయ్యే “తుపాను” లు వీయించుతారు. కారణం?

స్వయంప్రతిభ సాధనంవల్ల కలిగేదని వీళ్ళు నమ్మరు. యీ ప్రతిభ, పుట్టుకతోనే కలుగుతుంది కాబట్టి ప్రపంచం యీ ప్రతిభని యీఇనాటికాక్కుంటే రేపటికైనా గుర్తిస్తుందని నమ్ముతారేమో! వీరికున్న ప్రతిభ విలక్షణమైనది. సాధన విపరీతమైనది. వర్తమానాన్ని అర్ధం చేసుకోలేక, భవిష్యత్తువైపు తేరిపారా చూడలేక గతంలో తలదూర్చి బ్రతుకుతుంటారు.

పుట్టుకకి ప్రతిభకి సాపత్యం లేదని, సంబంధం ఉండదని యెవరూ అనరు. కాని అంతటితోనే అది అంతమవుతుందంటే అభ్యంతరం వస్తుంది.

సాహిత్యం కూడ ఒక వృత్తి లాంటిదే. మిగతా వృత్తుల విలువలకి, యీ విలువలకి వ్యత్యాసముంది. నిజమే. కాని మిగతా వృత్తులలో, నైపుణ్యం సంపాదించటం ఎంత కష్టమో, యీ వృత్తిలో ఆరి తేరెందుక్కుడా అంత దీక్షా, సాధనా అవసరమే. ఈ సాధన గడిచిన చరిత్రని, భాషాబేషజాన్ని పరిశీలించి, సొంతం చేసుకున్నంత మాత్రాన సిద్దించేది కాదు. చరిత్ర వెనుకవున్న సత్యాన్ని, భాషకున్న చరిత్రనీ, ప్రయోజనాన్ని గూడా గుర్తించగలగాలి. ఇదంతా సమకూడాలంటే యెడతెగని కృషి వుండాలి.

ఇందుకు రచయితలందరు కృషికున్న విలువని గుర్తించాలి; కృషి అంటే వున్న చిన్నచూపుని సంస్కరించుకోవాలి. రచయిత కూడ కొన్ని హద్దులో కార్మికుడేనన్న విషయాన్ని మరిచిపోగూడదు. అప్పుడే కష్టజీవుల అండని నిలబడటంలో వున్న గౌరవం అర్ధమౌతుంది. అప్పుడు గాని ఈట్స్ అన్న మాటల్లోని యదార్ధం అవగతం కాదు; ” You must learn your trade.”

రచయిత – రచనలు
మీద కీ..శే అట్లూరి పిచేశ్వరరావు అభిప్రాయాలు

సృజనాత్మకం

ఆ తల్లి పిల్లల్ని పోషించే విధిని నిర్వహించలేనట్లే, పెద్ద మనిషిసాంఘిక చైతన్యానికి దారి చూపలేడు.

సంఘంలో చైతన్యం కలగాలంటే, సృజనాత్మక రచనలు కావాలి. సృజనాత్మక రచనలు, సంఘంలో చైతన్యాన్ని విద్యుద్దిపించాలాంటే, సాంఘిక సంసృతీ సంప్రదాయాలు అందులో సంలీనం కావాలి. మన సాంఘిక ప్రాచీన జీవితంలోని చచ్చుపుచ్చుల్ని దులిపి, కడిగి, యేరి, సజీవభాషనూ, రూపాల్ని, సాంకేతికాలనూ స్వీయం చేసుకోవాలి. అప్పుడుగాని ప్రజల హృదయతంత్రుల్ని మీటి సంగీతాన్ని పలికించలేము.

ఈనాడు గలగల తొణికే విషాదాశ్రువుల్ని , కణకణ మండే విలాపాగ్నూలని, సాహిత్య రూపాల్లో సాక్షాత్కరింపజేసుకోవాలి. దారిద్ర్యాలను పరిష్కరిస్తూ, దౌర్జన్యాలను బహిష్కరించే బాటలకు రూపులు దిద్దాలి.

వ్యదార్థజీవితాల యధార్ధాన్ని చిత్రిస్తూ, సంఘానికి భవిష్యత్తు చూపే సోపానాలను నిర్మించుకుంటూ సంఘం అంతా హర్షాన్ని పూచేట్లు చేసుకోవాలి.

అదే ప్రజా సాహిత్యం. ప్రజాసామాన్యం అంతా నిరక్షరాస్యులుగా వున్న మధ్య యుగాలలో గూడా ఉత్తమ సాహిత్య రూపాలు ప్రసిద్ధి కెక్కాయి. ఆ నాటికి నియమితమైన సాహిత్య చైతన్యంతో, ప్రజాజీవితాన్ని తరచి, ప్రజలిని కలవరపరచిన సమస్యల్ని వారి హృదయాలకు హత్తుకునేట్లు చిత్రించిన సంస్కృతీ రూపాల్నీ, ఈ నిరక్షరాస్యులైన ప్రజలే అత్తారు బలంగా దాచుకుని, ఆనందించారు; ఈనాడు అంతే.

బుధనిర్వచనం
నిరక్షరాస్యుడు: కుక్షి కోసం చక్షువులు మూసుకునే మనిషి.

అట్లూరి పిచ్చేశ్వర రావు

కార్టూన్లు

వినతి
“విన్నవి – కన్నవి” అనే అనే శీర్షికతో, అట్లూరి పిచ్చేశ్వర రావు ఆ నాటి పత్రికలో వ్రాసిన వ్యాసాలివి. సుమారు రెండు దశాబ్దాలకు పైగా ఆయా సమకాలిన ఘటనలపై వ్రాసినవి. వ్యక్తులు పరిస్థితులు మారినా, ఈ నాటికి వర్తించే విమర్శనా, వ్యంగ్యము ఈ రచనలలోని విశిష్టత.

అందులో ఒకటి ఇది.

* * *
” ఇంటా బయటా కూర్చున్నప్పుడూ, తిరుగుతుండగాను కనిపించిన వ్యక్తులు మాట్లాడిన మాటలు ఇవి. సంస్కరించకుండా విన్నవి విన్నట్లు, కన్నవి కన్నట్లు ఒక వరుసా క్రమము ఏర్పరచకుండా మీకు ఒప్పచెబుతున్నా. అయినా వరుసా క్రమము ఏర్పడి వుంటే అందుకు గౌరవం ఆయా వ్యక్తులకే దక్కుతుంది. ఆయా మాటలు నాకు వినబడేంత చేరువగా మాట్లుడుకున్నందుకు వారందరికి ధన్యవాదాలు.” – అట్లూరి పిచ్చేశ్వర రావు
***

రెడ్డేమంటున్నాడు?

గోదావరి వరద బాధితులకి సహాయం చెయ్యండి.

మా కర్నూలికా వరదలు రావు.

దొడ్డిగుమ్మం గొళ్ళెం వూడదు.

నా సీమ రాయలసీమ కాదండి.

ప్రకాశం అవుతాడంటారా?

దిడ్డిగం వేసి ముడ్డితొ దాటే వారుంటారు.

ఏమో లెండి. బట్టతలలు బట్టతలలే మొకాళ్ళూ,

మోకాళ్ళే

ఎన్ని చెప్పినా ఆయన రాజాకీయనుభవాని

కున్నంత వయసుగూడా లేదాయె వీళ్ళకి.

అబ్బో! మా మంచి విగ్రహం!

ఎంత మంచి కాకపొతే అంతమంది పోలీసులు

కాపలా కాయవలసి వచ్చిందంటారు.

విగ్రాహాలకి ఆగ్రహం వుండదు. ఒకటే

నిగ్రహం.

అదే మృగ్యం.

మీసాలు లేనివరికి రోసాలు మిక్కుటం.

ఆర్డినెన్సులు పెట్టడంలో అగ్రతాంబూలం మనదే చూడండి.

* * *