విదేశాలలో ‘కవిరాజు‌’ త్రిపురనేని 125వ జయంతి కార్యక్రమాలు

విదేశాలలో కూడా ‘కవిరాజు‌’ 125 జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నారని నేటి ఆంధ్రజ్యోతి ద్వారా వారి మనుమడు, త్రిపురనేని గోపిచంద్ గారి పుత్రుడూ, లఘు / చలన చిత్ర నిర్మాత, దర్శకుడు, ప్రముఖ నటుడు  త్రిపురనేని సాయిచంద్ తెలియజేస్తున్నారు.

ఈ పత్రికా ప్రకటన మూలంగా కొంత  సమాచారం అందినా, సభా వేదిక, సంప్రదించవలసిన వారి వివరాలు తెలియడం లేదు.  బహుశ స్థలాభావం వల్ల పత్రికలు ఆ వివరాలను ఇవ్వలేక పోయినవేమో! ఆయా ప్రాంతాలలోని తెలుగు వారికి, ‘కవిరాజు’ అభిమానులకి ఆ వివరాలు అందిస్తే బాగుంటుంది. మీలో ఎవరికైన ఆ వివరాలు తెలిస్తే నాకు అందించ గలరు.  అందరికి అందుబాటులో ఇక్కడ పోస్ట్ చేస్తాను. ప్రస్తుతానికి ఈ పత్రికా ప్రకటనలో ఉన్న వివరాలతో మీరు ప్రయత్నించ గలరు.

వివిధ దేశాలలో కార్యక్రమం వివరాలు

అమెరికాలోని డల్లస్ నగరంలో మే 14 న  – శ్రీ తోటకూర ప్రసాద్ ఆధ్వ్యర్యంలో,

న్యూ యార్క్‌ నగరంలో మే 15న – శ్రీ త్రిపురనేని తిరుమల రావు ఆధ్వర్యంలో,

సెయింట్ లూయి నగరంలో మే 20 న – శ్రీ దండమూడి ఆధ్వర్యంలోను జరగనున్నాయి.

అలాగే,

ఇంగ్లండ్ లో మే 28 న – శ్రీ చదలవాడ సుబ్బారావు ఆధ్వర్యంలోను,

లండన్ నగరం లో మే 28 న – శ్రీ దాసోజు రాములు ఆధ్వర్యంలోను ఈ సభలను నిర్వహించడానికి ఏర్పాటులు జరిగినవి.

kaviraju anniversary in USA, Canada, UK
అమెరికా,కెనడ, ఐరోపాలలో కవిరాజు త్రిపురనేని రామస్వామి 125 జయంతి ఉత్సవాలు

నేటి ఆంధ్రజ్యోతిలో పత్రికా ప్రకటన