సంగీతం – మూడు కథలు

vedika october
వేదిక – 27 అక్టోబరు 2018

 వేదిక మిత్రులకు,
ఈ శనివారం అంటే 27 అక్టోోబరున, 2018 నాడు “వేదిక” సాహిత్య సమావేశంలో
సంగీత నేపధ్యంతో మూడు కథలు గురించి ముచ్చటించుకుందాము.
కానుక – ముళ్ళపూడి వెంకటరమణ ( మోహిత)
వాయులీనం – చా సో (ఊణుదుర్తి సుదాకర్)
చూపున్న పాట – కె ఎన్ వై పతంజలి (శ్రీమతి. రామలక్షి)

కధలను ఇక్కడ ఆన్‍లైన్‍లో చదువుకోవఛ్హు.
http://bit.ly/Vedika27Oct2018
మరో ముఖ్యమైన విషయం
అక్టోబరు 25 ఉదయాన, అధ్యాపకులు, రచయిత కవన శర్మ గారు బెంగుళూరులో చనిపోయారు. వేదిక వారికి శ్రద్దాంజలి ఘటిస్తుంది.

సమావేశం సాయంత్రం 5.30కి మొదలవుతుంది. సభాస్థలి: ఆలంబన, 85 – హెచ్ ఐ జి కాలని, వెంగళాస్ కేటరర్స్ పక్కన, బాలాజీనగర్, కూకట్‌పల్లి, హైదరాబాదు 500072.
దారి వివరాలకు; +(91)-40-2305 5904, +(91) – 9440103189, 98483 21703
Google Map:
https://goo.gl/maps/GvjOi

How to reach the venue Aalambana Hyd – వేదిక చేరుకోవడానికి దారి:
Omni Hospitals is the land mark visible on Kukatpally village main road. Take the road adjacent to it. You will find Kalyan Jewellers to your right on that road. Stick to that road. Pass ‘More’ departmental store, to your left. You will come across a ‘+’ junction.. and then Apollo Pharmacy, again to your left, while approaching from the Kukatpally main road. Take the left there and you will find Aalambana to your right. The 3rd building.

కథ 2014 … మరో ముగ్గురు కథకులు

katha 2014 book launch invitation

కథ 2014 కథా సంపుటి కథాసాహితి వారి ప్రచురణలో ఇరవై అయిదవది.  ఈ పాతిక సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వెలువడింది.  కథాసాహితి తొలి కధల సంపుటి వెలువడింది 1990 లో.  కీ శే ఆచార్య. చేకూరి రామారావు గారి చేతులమీదుగా ఆవిష్కరణ.  ఆనాటి సభాధ్యక్షులు ఆచార్య కె.వి శివారెడ్డి.  ఆ అధ్యక్షుల వారిది తెనాలి.  పాతికేళ్ళ కథ 2014 కూడా తెనాలిలో అవిష్కరణకి నోచుకోవడం కాకతాళీయం అయినా తెలుగు సాహిత్యంలో ఒక చారిత్రక ఘట్టం.

ఇక ఆ ముగ్గురు కథకులు ఎవరో చూద్దాం.

Author Patanjalisastry
తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారి తొలి కథ సీతన్న తాట.  ఇది 1962 లో ఆంధ్రప్రభ వారు ప్రచురించారు.  వీరి ఇతర కథలు, నవలలు గురించిన వివరాలు కథానిలయంలో
ఇక్కడ తెలుసుకోవచ్చు.

వాల్ పోస్టర్, సర్మా, గారడీ, రామేశ్వరం కాకులు ఇదివరలో ఆయా కథ వార్షిక సంకలనాలలో ప్రచురించారు.

వీటిలో వేదిక లో రామేశ్వరం కాకులు మీద చర్చ జరిగింది. ఆ కధని ఇక్కడ చదువుకోవచ్చు.

అద్దేపల్లి ప్రభు, కాకినాడ వాస్తవ్యులు.  వీరి తొలి కధ విలువలు 1984 లో అరుణతార మాస పత్రికలో వెలువడింది. వారి ఇతర సాహిత్యం కథానిలయంలో ఇక్కడ చూడండి.

     

Sunil Kumar P V - Author

1986 స్వాతి వార పత్రికలో ప్రచురించిన మూషికార్జునీయం కథకులు పి విసునీల్ కుమార్. లఘుచిత్రం గా వెలుగుచూసిన కథ దెయ్యం వీరిదే.  వేదిక లో వీరి తోక దెయ్యం చెప్పిన డిసిప్లి మీద 2015 మే నెలలో చర్చించుకున్నారు.   ఆ కథని ఇక్కడ చదువుకోవచ్చు.

వీరు ముగ్గురూ, నిన్న ముగ్గురు కధకులు మాత్రమే కాదు.  ఇంకా ఉన్నారండి.  వారిలో మరో ముగ్గురు కధకులని మీకు రేఫు పరిచయం చేస్తాను.

రానున్న ఆదివారం, సెప్టెంబరు 20, 2015 న తెనాలిలో  జరగనున్న ఆవిష్కరణ సభకి ఇదిగో ఆహ్వానం.katha 2014 book launch invitation