శ్రీదేవి అయ్యప్పన్ తో నా పరిచయం

శ్రీదేవి ఆ క్రితం రాత్రి చనిపోయిందన్న వార్త Facebook లో చదవగానే ఒక చిన్న షాక్!  అప్రయత్నంగానే “అయ్యో!” అనిపించింది.  అంత చిన్న వయసులోనే పోవడం, పైగా ఊహించని విధంగా! ఎంత వరకు నిజం అని తెలుసుకోవడానికి, వెంటనే గూగుల్ లోకి వెళ్ళి సెర్చ్ చేస్తుంటే…ఆమె తండ్రి, అయ్యప్పన్ గారు, తల్లి రాజేశ్వరి, చెల్లెలు శ్రీలత గుర్తు వఛ్హారు.  అంతేకాదు, బహుశ వారి బంధువు మరొకమ్మాయి కూడా గుర్తు వఛ్హింది.

వీళ్లందరితో పాటు అయ్యప్పన్ గారిని పరియం చేసిన టి సి సుబ్బన్న గారు.  అప్పట్లో అయిదారు, సినిమాలు తీసి చేతులు కాల్చుకున్న నిర్మాత.  బెరైటీస్ ఎగుమతులు లాభాసాటిగా ఉందని ఆ గనులకోసం, చాలా కష్టపడ్డారు.  గల్ఫ్ దేశాల చుట్టూ తిరిగాడాయన.  చివరికి మాకెవరికి తెలియకుండా మద్రాసు జనరల్ హాస్పిటల్ లో పోయారు.  వాళ్ళందరూ ఆ  మనుషులు, వాళ్ళ కలలు అన్ని కళ్ళముందు కదలాడినవి.

గూగుల్ సర్చ్ లో శ్రీదేవి మరణం మీద వస్తున్న కొన్ని వార్తలు చదివినప్పుడు బాధవేసింది.  అయ్యో అనిపించింది.  ఒక పోస్ట్ వ్రాద్దామనుకున్నాను.  కాని అంతక్రితం రోజే ప్రముఖ సాహిత్య వేత్త మునిపల్లె రాజు గారు పోయారు.  ఆ సందర్భంలో ఎవరో ఫేస్‍బుక్ లో కొంచెం వ్యంగ్యంగా, ఇక మళ్ళీ మొదలన్నమాట పోయిన వాళ్లందరితోను వాళ్ళు తీసుకున్న ఫోటోలు, వాళ్ళ ఘాఢమైన స్నేహాలతో ఈ ఫేసుబుక్ గోడల నిండా పిడకలు,  పేడ కంపు అంటూ పోస్ట్ చేసింది గుర్తు వఛ్హింది.  అందుకని తటపటాయించాను.  చివరకి పోస్ట్ చేసాను కూడా!  కానీ  శ్రీదేవి లాంటి నటితో నాకున్న పరిచయాన్ని నేను exploit చేస్తున్నానన్న అపవాదు నా మీద పడుతుందా అన్న అనుమానంతో ఆ పోస్ట్ ని తొలగించేసాను.

మళ్ళీ సందిగ్ధం!

మద్రాసులో, రాణీ బుక్ సెంటర్ రోజులు నా జీవితంలో స్వర్ణయుగం!  మద్రాసులోని తెలుగువారికి కూడ ఆ మూడు దశాబ్దాలు స్వర్ణయుగమే!  అంతకు ముందు, ఆ తరువాత నాకు తెలీదు ఎందుకంటే నేను లేను గనక.  రాణీ బుక్ సెంటర్ అంటే అమ్మ, చౌదరాణి.  తనని గుర్తు చేసుకోవడమే నేను.  అలాగని తనని మరిచిపోయానని కాదు…  but anyways..ఆంతకు ముందు వ్రాసి డిలీట్ చేసింది తెలుగనుకుంటాను…కాని ఈ సారి నా తమిళ తంబీలకి ఇతర భాషా మిత్రులకి కూడ తెలుస్తుందని ఇంగ్లిష్ లో వ్రాసాను.  మరి ఫోటో కావాలి కదా? శ్రీదేవి కుటుంబంతో ఉన్న ఫోటోలు చూసిన గుర్తు ఉంది నాకు.  అవి గౌతమ్ అని ఆ రోజుల్లో ప్రోట్రైట్ ఫోటోలకి గొప్ప పేరున్నతను తీసిన ఫోటోలే సరి అనుకున్నాను.  ఆ ఫోటొలు అప్పట్లో వఛ్హే Star & Style, Stardust, Cine Blitz, Filmfare లాంటి పత్రికల్లో వఛ్హిన గుర్తు.  నెట్ లో చాలా సేపు వెతగ్గా దొరికింది.  చాలా బొమ్మలుండాలి గాని ఒకటే దొరికింది. (Twitter లో శ్రీదేవి హాండిల్ లో చూసాను కాని మళ్ళీ అది కనపడలేదు ) అదే నేను వాడింది. Facebook లో నా పోస్ట్ లన్ని పబ్లిక్.  ఇక్కడ ఫేస్‍బుక్ లో నా ఇంగ్లిష్ పోస్ట్. ఒకవేళ మీకు ఆ పోస్ట్ అందుబాటు లోకి రాకపోతే ఇక్కడిఛ్హాను.

Shocking to know that the Sridevi, I knew had to pass away this early! Paan chewing Ayyappan garu, her father is a lawyer and is a Telugu gent, from Sivakasi, the town that makes the firecrackers for India if not the world. A pleasant man, always dressed in white, be it a lungi, or trousers and a shirt.

I am talking about the times, around late 70’s, when she used to come by in a rikshaw along with her mother Smt Rajeswari and drop into our #RaniBookCenter, just to know if her father had come by. There were many times when Ayyappan garu and I used to have cuppa tea at Hotel Hameedia and this lady with her mother would be waiting in the book store for her dad! Her younger sister Srilatha was a Holy Angels student.

Her father, once when we met in Andhra Bank, (it was then in a rented building adjacent to the present police station on Pondy Bazaar) asked me if I had watched #moondrampirai and urged me to go watch it. He considered it to be one of her best performances at that time. She had already become popular and busy by then. She seems to have been in a rush to leave!

Sridevi, Ayyappan, Srilatha, Rajeswari
Sridevi with her parents and younger sister Srilatha

ఆ తరువాత BBC Telugu బిబిసి తెలుగు వారు నన్ను సంప్రదించారు.  “మీ జ్ఞాపకాలు  ఏవైనా ఉంటే పంచుకోగలరా, మా బిబిసి వెబ్‍సైట్ కి?” అని అడిగారు.  కొంత వ్యవధి కోరాను. వారికి అర్ధం అయినట్టుంది.  “మీకు తెలిసినవారు మరెవరైనా …తెలుగులో చెప్పగలిగిన వారుంటే సూచించమని,” కోరారు.

అప్పట్లో ఈ టచ్ స్క్రీన్ ఫోనులు లేవు కాబట్టి సెల్ఫీలు వగైరా లేవు.  ప్రతి రంగంలోను మరీ ముఖ్యంగా అటు సాహిత్య రంగంలోను, ఇటు చలని చిత్ర రంగంలోను దాదాపు ప్రముఖులందరితోనూ సత్సంబధాలుండేవి.  కనీసం ముఖ పరిచయాలుండేవి.  కాబట్టి వాళ్లతో ఫొటోలు తీసుకోవాలి అన్న ఆలోచన ఉండేదికాదు.  ఇంకొక విషయం.  నాకంటూ ఒక ఫిలాసఫి ఉండేది.  వాళ్ళు వాళ్ళ రంగాలలో నిష్ణాతులు.  వ్యాపారస్థులు కావఛ్హు, విద్యావేత్తలు కావఛ్హు, నటులు కావఛ్హు, పారిశ్రామికవేత్తలు, నిర్మాతలు, కళాకారులు, దర్శకులు, సంగీతం,  MNC సంస్థలలో ఉన్నతాధికారులు కావఛ్హు. కాని వారి దైనందిన జీవితంలో  ఎటూ వత్తిడి ఉంటుంది.  వారు వఛ్హేదే వాటికి దూరంగా పుస్తకాలు చదువుకుంటూ, సేద తీరుదామని.  మళ్ళీ వారి వృత్తికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు గురించి మాట్లాడటం ఏం బాగుంటుందని మాట్లాడేవాడిని కాదు.  వారు ప్రస్తావిస్తే వాటి గురించి మాట్లాడేవాడిని.  అమ్మ దగ్గిరకి సలహాల కోసం వఛ్హేవారు సరే, సరి. అది మరొకసారి!

అందుకని ఇక్కడ కూడా నేను శ్రీదేవి విషయంలో ప్రసార మాధ్యమాలలో విపరీతమైన చెత్త వఛ్హినా వాటి గురించి ప్రస్తావించలేదు.

ఇక బిబిసి వారికి తెలుగులో నేను శ్రీదేవి గురించి వ్రాసిన చిన్న కాలం ఇక్కడ చదువు కోవఛ్హు.

ఇది వ్రాసి బిబిసి తెలుగు కి ఇవ్వడానికే సమయం సరిపోయింది.   అందుకని నేను ప్రత్యేకంగా మళ్ళీ ఇతరులనెవ్వరిని సంప్రదించలేదు.  అవకాశం ఉండి ఉంటే మట్టుకు శ్రీదేవితో కలిసి ఒక సహయ దర్శకుడిగాను, నటుడుగాను పని చేసిన వాడు, రక్తం (2017) చిత్రంలో తన పాత్రకు అంతర్జాతీయ గుర్తింపు పొందిన నటుడు, పూర్వాశ్రమంలో దర్శకత్వరంగంలోనూ, నిర్మాతగాను అనుభవమున్న సన్మిత్రుడు బెనర్జి ని కోరి ఉండేవాడిని.

ఏది ఏమైనా అంత త్వరగా తను వెళ్లిపోవాల్సి రావడం బాధాకరం.

ఇంకా చాలా వుంది.  బహుశ తరువాతెప్పుడైనా…చూద్దాం!

 తా.: ప్రముఖ తెలుసు సాహితీవేత్త ఆరుద్ర గారి మనుమడు (కవిత చింతామణి కుమారుడు) గౌతమ్ చింతామణిThe Last Diva అనే శీర్షికతో The Pioneer పత్రికలో తను వ్రాసిన వ్యాసంలో రాణీ బుక్ సెంటర్ – శ్రీదేవి (అయ్యప్పన్) గురించి ప్రస్తావించాడు. గౌతమ్ అనాటి సూపర్ స్టార్ రాజేశ్ ఖన్నా మీది ఒక పుస్తకం వ్రాసాడు.   దాన్ని గురించి కూడా వ్రాసాను, ఈ బ్లాగులోనే ఇక్కడ చదువుకోవఛ్హు.

మరో మాట.  నాలుగేళ్ళూ నిరాఘటంగా వెలువడిన సారంగ వెబ్ జైన్ 2017 జనవరిలో విరామం తీసుకుంది. కొన్ని కొత్త శీర్షికలతో ఈ ఉగాది (ఆదివారం, మార్చ్ 18, 2018) మళ్ళీ ఒక పక్షపత్రికగా పాఠకుల ముందుకొఛ్హింది.  అందులో ఇదివరకున్న కథా సారంగ శీర్షికని పునఃప్రారంభిస్తూ నేను వ్రాసిన కధ ఇడ్లి, వడ, సాంబార్ ని తొలి కధగా ఎన్నుకుంది.  అందుకు సారంగ సంపాదక వర్గానికి, మరీ ముఖ్యంగా అఫ్సర్ కి ధన్యవాదాలు. మీరు ఆ కధని ఇక్కడ చదువుకోవఛ్హు.  మీ అభిప్రాయలని వ్యాఖ్యల రూపంలో అక్కడ కాని ఇక్కడ కాని తెలియజేయ మనవి.

బాటసారి – వెండితెర నవల – అట్లూరి పిచ్హేశ్వరరావు

బాటసారి_baaTasaari

భరణీ  స్టూడియోస్ అధినేత పాలువాయి రామకృష్ణ దర్శకత్వంలో వెలువడిన ‘బాటసారి‘ లో నాయిక పాత్ర పోషించిన భానుమతి,  రామకృష్ణగారి సతీమణి. అక్కినేని నాగేశ్వరరావు నాయకుడుగా నటించిన ఈ చిత్రానికి మూలకధ బెంగాలి నవల ‘బడదీది‘. బెంగాలి  రచయిత శరత్‍బాబు.  ఆ ‘బాటసారి’ చలనచిత్రాన్ని వెండితెర నవలగా ఆవిష్కరించి తెలుగువారికి వెండితెర నవలలను పరిచయం చేసింది అట్లూరి పిఛ్హేశ్వర రావు. త్రిపురనేని రామస్వామి కనిష్ట పుత్రిక చౌదరాణి వీరి శ్రీమతి. ఆ విధంగా  బారిస్టరు, శతావధాని .’కవిరాజు’ త్రిపురనేని రామస్వామి కి అల్లుడు.  అట్లూరి పిఛ్హేశ్వరరావు నాకు తండ్రి. చౌదరాణి నాకు తల్లి.  నాన్న 92 ముగించుకుని 93లో అడుగు పెడుతున్న రోజు ఇది.  బానుమతి పాడిన “ఓ బాటసారి…”  పాట ని ఇక్కడ వినవఛ్హు. 

బాటసారి_baaTasaari
బాటసారి – baa Tasaari

baaTasaari (బాటసారి) film novel – 153 pages was published by the makers of the movie in July 1961.  It was priced 0.75 np.  That would be three annas.

Tidbit

You will notice the banner mentioning the title of the movie is signed GHRao He was quite popular in those days.  I personally knew him.  My mother and I were keen on having the signboard for the proposed Rani Book Centre (an exclusive Telugu bookstore) written in Telugu.  Our search brought him to us. He was Hanumantha Rao. In fact he did the first sign board in Telugu for Rani Book Centre in 1969.  What a coincidence!

ఇంద్రజాలికుడు

వరండాలో నుంచి హాలు గుమ్మందగ్గిరకి వెళ్ళి లోపలికి తొంగి చూడ్డం.  అమ్మ కనపడుతుంది శూన్యంలోకి చూస్తూ.    తన పక్కన అందరూ స్త్రీలే.  అమ్మ కి అటువైపు చాప మీద నాన్న కదలకుండా.  ఎవరి దుఃఖంలో వారు.

నేను బేరుమని ఏడవడం.  ఇవతలికి రావడం. వరండాలో పేము కుర్చిలో కూలబడటం. ఏడుపు.  చూట్టూ ఉన్నవాళ్లలో ఎవరో ఒకళ్ళో ఇద్దరో దగ్గిరకి తీసుకోవడానికి ప్రయత్నించడం.  నేను వాళ్ళని దూరంగా నెట్టివేయడం. కాసేపటికి వెక్కిళ్ళు ఆపుకోవడం.  ఈ లోపు మరెవరో హాలులోకి వెళ్ళడం.  మళ్ళీ లోపలినుండి సన్నగా రోదన మొదలవ్వడం.

అది విని నేను మళ్ళీ బిగ్గరగా ఏడవడం.  వెక్కిళ్ళు.  నా స్నేహితులు ఎవరూ పక్కన లేరు.  ఒంటరిని.  ఎవరి దగ్గిరకి వెళ్ళకుండా నేను ఆ పేము కుర్చిలో కూర్చుని ఏడుస్తున్నాను.  చుట్టూ తెలిసినవాళ్ళు, తెలియని వాళ్ళు, బంధువులు, పరిచయస్తులు అందరూ పెద్దవాళ్ళే.

నా స్నేహితులు ఎవరూ లేరు.
వెనక ఎక్కడో నా మోతి ఏడుపు.

ఆ రాత్రి విలపిస్తూ, రోదిస్తున్నప్పుడు వచ్చాడు ఆయన.  ఏవో వాళ్ళతో గుసగుసలు.  లోపల హాల్లోకి వెళ్ళివచ్చాడు. ఆయన్ని గుర్తు పట్టాను.  ఏమి మాట్లాడలేదు. నేను ఏడుస్తున్నాను.  ఎవరో నా పక్కనే ఒక ఫోల్డింగ్ చెయిర్ వేసారు.  కూర్చున్నాడు, ఆయన.  గుర్తుపట్టాను ఆయన్ని. అంతకుముందు ఏవో స్టూడియోలలో షూటింగులలో చూసాను.  ఆయనంటే ఇష్టం కూడా.  నెమ్మదిగా నా ఎడమరెక్క పట్టుకుని దగ్గిరకు తీసుకున్నాడు.  ఒళ్ళోకి తీసుకున్నాడు.  కళ్ళు తుడిచాడు.  ఏవో అవి ఇవి మాటలు చెపుతున్నాడు.  నేను వినడం మొదలుపెట్టాను.  చేతులు కదిలిస్తున్నాడు.  ఖాళీ అరచేతులు.  గబుక్కున అందులో ఒక కలం కనపడింది.  గుప్పెట మూసాడు. తెరిచాడు.  అరచేతిలో ఏమిలేదు.  మళ్ళీ ఖాళీ.  మరో చెయ్యి చూపించాడు.  అందులో ఉంది కలం.  ఈ సారి నాణేలు.  గుప్పిట్లో చూపించి మూసి తెరిచాడు.  లేవు.  తన షర్ట్ జేబులోకి వెళ్ళిపోయినవి.

నా ఏడుపు ఆగిపోయింది.  మళ్ళీ నాకు ఏవో కబుర్లు చెప్పాడు.  తల నిమిరాడు.  బుగ్గలు నిమిరాడు.  కళ్ళు తుడిచాడు.  నా స్నేహితుడి లాగా బుజ్జగించాడు.

లేచి నిలబడ్డాడు.  ఎవరినో పిలిచాడు. వారికేదో చెప్పాడు.  హాలులో నుంచి ఎవరో వచ్చారు.  వరండా లోనుంచి నన్ను హాల్ లోకి, అటునుంచి పడకగదిలోకి తీసుకెళ్ళారు.  నా మంచం మీద పడుకోబెట్టారు.  దుప్పటి కప్పారు.  నేను అలాగే నిద్రపొయ్యాను.

ఆ తరువాత కూడ ఆయన అప్పుడప్పుడు వచ్చేవారు. అమ్మని నన్ను పలకరించేవారు. కాసేపు కూర్చుని కబుర్లు చెప్పేవారు.  ఆయనే రమణా రెడ్డి.

వెండి తెర నవలలు – అట్లూరి పిచ్చేశ్వరరావు

సినిమా చూడటానికి ఎడ్ల బళ్ళు కట్టుకుని వెళ్ళిన వాళ్ళున్నారు.  వైజాగ్ నుంచి మద్రాసుకి ఒకరాత్రంతా ప్రయాణం చేసి వచ్చి సినిమా చూపించమని నన్ను వేధించుకుని తిని సినిమా చూసి అటునుంఛి అటే సెంట్రల్ స్టేష‌న్‌లో పొగబండికి రిజర్వేషన్ కూడా నాతో చేయించుకుని వెళ్ళిపోయినవారున్నారు.

అటువంటి అవకాశం లేని వారికి అప్పట్లో ఆకాశవాణి వారి సంక్షిప్త శబ్ద చిత్రాలే గతి.  ఒకటికి పది సార్లు చూడటానికి అవకాశం లేని వారు,  ఎన్టీవోడి డవిలాగు, ఏ ఎన్ ఆర్ ఎస్‌వీఆర్ డవిలాగు కాకుండా అసలు కథ ని ఓల్‌మొత్తం అర్ధం చేసుకోవడానికి, చదివి చూడలేని తోటివారికి చదివి వినిపించడానికి వెండితెర నవలలు భలే పనిచేసేవి.  అంతే కాకుండా ఆ వెండి తెర నవల ద్వారా తమ సినిమాలకి కొంత అదనపు ఆకర్షణ ని కూడ తెచ్చుకోవడానికి వాటిని వాడుకున్నారు ఆనాటి చలనచిత్ర నిర్మాతలు, పంపిణీదారులు.

Pitcheswara Rao Atluri (1924 - 1966)

తెలుగు లో వెండితెరనవలకు ఆద్యులు అట్లూరి పిచ్చేశ్వర రావు (12th April 1925 – 26th Sept 1966).  వారి తొలి తెలుగు ప్రక్రియ కి తెరతీసినది గౌతమ బుద్ధ లఘుచిత్రం.  ఆ బాటనే పయనించినవారు రామచందర్, ముళ్ళపూడి వెంకటరమణ, రావి కొండలరావు, నేటి చలన చిత్ర దర్శకులు వంశీ తదితరులు.

వెండితెర నవలల మీద TV 5 ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తమ “Favorite Five” శీర్షికన ప్రసారం చేసింది.  సుమారు పదిహేను నిముషాలు నిడివి ఉన్న ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు.

గమనిక:
ఈ ప్రసార కార్యక్రమం పూర్తి హక్కులు TV5 కే చెందుతాయి. నాకు ఎటువంటి సంబంధం హక్కులు లేవు.
All rights to this program whether implied or otherwise belong to TV5 or to their respective entities.